భారీ వర్షానికి 100 ఎకరాల మొక్కజొన్న నీటి పాలు

74చూసినవారు
నంద్యాల జిల్లా పరిధిలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో పండిన మొక్కజొన్న, సోయాబీన్స్ పంటను అరబెట్టుకున్న క్రమంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయిందని, వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట నష్టం కావడంతో రైతులు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి తడిసిన పంట నష్టం విలువ సుమారు 50 లక్షల మేర ఉంటుందని రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్