రక్తదానం మరొకరికి ప్రాణదానం: ఎమ్మెల్యే

73చూసినవారు
రక్తదానం మరొకరికి ప్రాణదానమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. తలసేమియా బాధితుల కోసం పత్తికొండ డిగ్రీ కళాశాల విద్యార్థులు వంద మంది రక్తదానం చేశారు. ప్రిన్సిపాల్‌ మాధురి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రారంభించారు. వైద్యురాలు కల్పన, కోఆర్డినేటర్‌ రామక్రిష్ణ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిది బత్తిని లోక్‌నాథ్‌, నరసింహ చౌదరి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్