మల్లన్న దర్శనానికి బారులు తీరిన భక్తజనం

78చూసినవారు
శ్రీశైల మహాక్షేత్రానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండడంతో భక్తుల క్యూ లైన్ లో కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు. ఈ తరుణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఆయా సిబ్బందిని ఈవో పెద్దిరాజు ఆదేశించారు. మంచినీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు, భక్తులకు పంపిణీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్