చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి బుధవారం పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్కూల్లో విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను ఆమె ఆసక్తిగా పరిశీలించారు. పిల్లల ప్రతిభను చూసి ముగ్ధులైన నారా భువనేశ్వరి గారు వారి సృజనాత్మకతను, ఆలోచనలను ప్రశంసించారు.