జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ను మంగళవారం ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆయన పార్టీ కార్యాలయంలో కావలి నియోజకవర్గం జనసేన నేత అళహరి సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించారు. ఆయన వెంట పలువురు జనసేన నేతలు ఉన్నారు.