దగదర్తి గ్రామంలో మంగళవారం రాత్రి టిడిపి నేత మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాలేపాటి మాట్లాడుతూ. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన మేలును అర్థమయ్యేలా స్థానిక ప్రజలకు వివరించారు. మళ్లీ వైసీపీని గెలిపిస్తే సర్వనాశనం జరగబోయే ఆంధ్ర రాష్ట్రాన్ని కళ్ళతో చూడవలసి వస్తుందన్నారు. ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.