బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురువారం పాఠశాల పిల్లల్లో ఏర్పడే కంటి సమస్యలపై జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి, గ్లకోమా, కండ్ల కలక, వంటి వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.