మరో 24 గంటల పాటూ అప్రమత్తంగా ఉండాలి

79చూసినవారు
మరో 24 గంటల పాటూ అప్రమత్తంగా ఉండాలి
మరో 24 గంటల పాటూ అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవ్వరూ వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ కృష్ణకాంత్‌ మత్స్యకారులకు సూచించారు. బుధవారం ఉదయం ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరంలో కలెక్టర్‌, ఎస్పీ పర్యటించి స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సముద్రంలో ఎవరూ వేటకు వెళ్లరాదని, మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్