విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మూడు గడ్డివాములు దగ్ధం

81చూసినవారు
మనుబోలు కె ఆర్ పురం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో శనివారం రాత్రి మూడు గడ్డివాములు దగ్ధమయ్యాయి. మందాటి కోటి, మందాటి ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు అనే ముగ్గురు పాడి రైతులకు ఇంటి పక్కనే ఉన్న ఆవరణంలో గడ్డివాములు వేసుకొని ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అంటుకున్నాయి. ఎగసిపడుతున్న అగ్నికీలలతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. పొదలకూరు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్