సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం వెంకటగిరి వస్తున్నారు. ఆయన సభను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం మధ్యాహ్నం 1. 30 గంటలకు వెంకటగిరిలోని త్రిభువని సెంటర్ వద్ద సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.