సిఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఉంటుందని వైసిపి అభ్యర్ధి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం నేదురుమల్లి భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లడుతూ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చిన ఘనత సిఎం జగన్ దక్కిందన్నారు. మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ఒక హామీను కూడా నెరవేర్చలేదని తెలిపారు.