పెంచలకోన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన లోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమంను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో టీటీడీ వేద పండితులు ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేసి నిత్యహోమాలు చేశారు. అనంతరం అనుజ్ఞ వేదస్వస్తి, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనము, అంకుర్పారణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.