మరమ్మత్తులకు గురై అరుగు ఎక్కిన ట్రాన్స్ఫార్మర్
వింజమూరు మండలంలోని బత్తినవారిపల్లిలో గత రెండునెలలకు పైగా మరమ్మతులకు గురికావడంతో విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ని అరుగుమీద పెట్టారు. ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని పండించే భూముల రైతులు వేరే చోట నుండి విద్యుత్ సరఫరా తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చింది. శుక్రవారం రైతులు మాట్లాడుతూ సంబంధిత అధికారులకు తెలిపినా ఫలితం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుపోవాలని కోరారు.