జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శనివారం రాత్రి ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన యువకులకు చెందిన బందు వర్గం మొత్తం పెనుగంచిప్రోలులో శనివారం రాత్రి ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.