కొండపల్లి కాలనీలో కమిషనర్ పర్యటన

51చూసినవారు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో శనివారం కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పర్యటించారు. కొండపల్లి జగనన్న కాలనీకి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని, రోడ్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరదల సమయంలో కాలనీవాసులకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యలు కమిషనర్ కు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్