ఇబ్రహీంపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

52చూసినవారు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం గ్రామంలో మంగళవారం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మైలవరం మాజీ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగుజాతి ఉన్నంత వరకు స్వర్గీయ యన్టీఆర్ ఖ్యాతి మరవలేనిదని అన్నారు.

సంబంధిత పోస్ట్