మైలవరం మండలంలో టిడిపి ఆత్మీయ సమావేశం

73చూసినవారు
మైలవరం మండలంలోని మర్సుమల్లిలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం రాత్రి నిర్వహించారు. పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ ఊహించని రీతిలో ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. మహిళలు హారతులు ఇచ్చి వారి ఆశీస్సులు అందజేశారు.

సంబంధిత పోస్ట్