ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే కొత్త ప్రభుత్వంలో దీనిపై నిర్ణయం వెలువడొచ్చని సమాచారం. ప్రస్తుతం ఈ పరిమితి రూ.15 వేలు కాగా ఆ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచనుంది. వేతన పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుండగా, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆ భారం పడనుంది. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు.