'బ్యాడ్మింటన్ ఆసియా'లో ముగిసిన భారత్ ప్రయాణం

57చూసినవారు
'బ్యాడ్మింటన్ ఆసియా'లో ముగిసిన భారత్ ప్రయాణం
బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణోయ్ ఓటమిపాలయ్యారు. చైనాకు చెందిన సిక్స్త్ సీడ్ హాన్ యువే చేతిలో సింధు పోరాడి 18-21, 21-13, 17-21 తేడాతో ఓడారు. దీనికి ముందు ఆమెతో 5సార్లు తలపడిన సింధు ఎప్పుడూ ఓడిపోలేదు. ఇక సెవెన్త్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రణోయ్, తైపీకి చెందిన అన్‌సీడెడ్ లిన్ చున్-యీ చేతిలో 43 నిమిషాల్లోనే ఓడిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్