ఉండవల్లిలో మంత్రులతో తన నివాసంలో బుధవారం ముఖ్య మంత్రి నారా చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఎవరికి ఏ శాఖ కేటాయింపు అనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చిందని సమాచారం. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి నేడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు పలు విషయాలపై దిశా నిర్దేశం చేసినట్లు సీఎంవో అధికారులు తెలిపారు.