జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్ లభించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు సోరెన్కు బెయిల్ మంజూరు చేసింది. 'హేమంత్ హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన తన ప్రజా కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తారని భావిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్.. హేమంత్' అని Xలో ఆమె పేర్కొన్నారు.