ఆ రోజే ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం

66చూసినవారు
ఆ రోజే ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం
ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు సాగు విషయంలో శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి.. వాటి ఆధారంగా ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్