AP: రబీ పంట నష్టం గణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24లోగా రబీ పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 33 శాతానికిపైగా దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో రైతుకు అయిదెకరాలకు మించకూడదని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 25 నుంచి 27 వరకు రైతు భరోసా కేంద్రాల్లో అభ్యంతరాలను స్వీకరించి, 31న తుది జాబితా ప్రకటిస్తారు.