బీజేపీ సర్కారు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆప్ నేతల వెంట పడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అందుకే కుట్రలు చేసి తనతో సహా తమ నేతలందిరినీ జైల్లో పెడుతోందని విమర్శించారు. అందుకే తామంతా కలిసి బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నామని, తమలో వాళ్లకు కావాల్సిన వాళ్లను జైల్లో పెట్టవచ్చని అన్నారు. కాగా ఇవాళ బీజేపీ కార్యాలయ ముట్టడికి కేజ్రీవాల్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.