ఏపీ ఈఏపీసెట్-2024 ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగంలో 31,386 మంది విద్యార్థులకు గాను 29,543(94.13%) మంది హాజరయ్యారని సెట్ ఛైర్మన్, వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. 1843 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు. కాగా, ఈ నెల 23 వరకు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు కొనసాగనున్నాయి.