కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది. ఎన్నో రాజకీయ మార్పులను చూశాను. ఇప్పుడు ఎన్డీఏతోనే మా ప్రయాణం. ఇవాళ కూటమి మీటింగ్కు ఢిల్లీ వెళ్తున్నా. ఆ తర్వాత ఏమైనా మార్పులుంటే మీకు తప్పకుండా చెప్తాను.’ అని అన్నారు.