పల్నాడు రైతులకు వరమైన వానలు

52చూసినవారు
పల్నాడు రైతులకు వరమైన వానలు
పల్నాడు ప్రాంతంలో ఇటీవల కురిసిన అధిక వర్షాలు రైతులకు వరంగా మారాయి. గతేడాదితో పోల్చుకుంటే సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. మాచర్ల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల వారి కార్యాలయ పరిధిలోని ఐదు మండలాల్లో పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 1, 49, 560 ఎకరాల సాగు భూమి వుండగా ఇప్పటికీ 1, 11, 267 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అక్టోబర్‌లో మరికొన్ని పంటలు సాగుచేసే అవకాశం ఉందని ఏడిఏ జగదీశ్వర్ రెడ్డి బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్