నకిలీ విత్తనాలతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి

73చూసినవారు
అచ్చంపేట మండలం తాళ్ళచెరువు గ్రామంలో యుఎస్-450 నకిలీమిర్చి విత్తనాలు వాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరిగోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన తాళ్లచెరువు రైతులతో నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్