త్వరలో సీఎంకు రూ. 25 లక్షలు ఇస్తా: ఎమ్మెల్యే జీవీ

78చూసినవారు
విజయవాడ వరద బాధితులకు బొల్లాపల్లి టీడీపీ నాయకులు నిత్యావసర వస్తువులు అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నాయకులు విరాళాలు మంగళవారం సేకరించారు. వాటితో బియ్యం, కందిపప్పు, నూనె, బట్టలు కొనుగోలు చేశారు. సంబంధిత వస్తువుల ఆటోను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. త్వరలో సీఎంను కలిసి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ తరఫున రూ. 25 లక్షలు అందజేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్