గురువులు నవ సమాజ నిర్మాతలు: ఎమ్మెల్యే

67చూసినవారు
గురువులు నవ సమాజ నిర్మాతలు: ఎమ్మెల్యే
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలిలో ఏపీటీఎఫ్ (1938) వైజ్ఞానిక ప్రాంతీయ మహాసభలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీటీఎఫ్ సంస్థతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. గురువులే నవ సమాజ నిర్మాతలని కొనియాడారు. మహాసభలకు బొబ్బిలి, బాడంగి, రాంబద్రపురం, తెర్లాం, దత్తీరేజేరు మండలాల నుండి భారీగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్