టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బొబ్బిలి
తెదేపా నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన ఆధ్వర్యంలో
తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బేబీనాయనతో పాటు మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా ఉన్నారు.
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ నాడు
ఎన్టీఆర్ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారని అన్నారు.