గంట్యాడ మండలంలోని లక్కిడాం జంక్షన్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, మాజీ మంత్రి పడాల అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సీనియర్ నాయకులు ఆధాడ మోహనరావు, డోల రాజేంద్ర, జనసేన నేతలు రాజు, వెంకటరావు బాలు, ప్రశాంత్, రాంబాబు, ముత్యాలరాజు, పైడిపునాయుడు, రమేష్ పాల్గొన్నారు.