పంపు ప్రాంతాలను సందర్శించిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి

82చూసినవారు
పంపు ప్రాంతాలను సందర్శించిన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి
మన్యం జిల్లాలో గత వారం రోజులు కురిసిన భారీ తుఫాన్ ప్రభావానికి ముంపుకు గురైన కొమరాడ మండలం కళ్లికోట గ్రామాన్ని మంగళవారం కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సందర్శించారు. నాగావళి నదీ ప్రవాహ ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్