చెక్ డ్యామ్ ని పరిశీలించిన ఎమ్మెల్యే

62చూసినవారు
గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డిఖళ్ళు పంచాయతీలో గండరగెడ్డ చెక్ డ్యామును కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి మంగళవారం పరిశీలించారు. వర్షాకాలం కావడంతో డ్యామ్ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి గిరిజనుల పంట పొలాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట మండల కన్వీనర్ సుదర్శనరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్