ఏనుగుల ఘణన చేపట్టిన అధికారులు

60చూసినవారు
ఏనుగుల ఘణన చేపట్టిన అధికారులు
ఏనుగుల గణన కార్యక్రమం ప్రారంభమైందని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన అన్నారు. ఏనుగుల గణనలో భాగంగా రెండవ రోజు కొమరాడ మండలం అర్తం రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాలలో సిబ్బంది చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 23 నుండి 25వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. దీంతో ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎక్కడ సంచరిస్తున్నాయి తెలుస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్