కురుపాం మండలం మొండెంఖళ్లు గ్రామంలో ఆదివారం ఓ మహిళ విద్యుత్ షాక్ తో మృతి చెందారు. గౌడు వీధిలో నివాసం ఉంటున్న జి.బుజ్జిలు (సుధారాణి) ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న విద్యుత్ వైర్లను తాకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.