ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

2209చూసినవారు
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయితీ లోని వైకేఎం నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న పల్లా సింహాచలం (39) అనే వ్యక్తి ఇంట్లో భార్య బిడ్డలు లేని సమయంలో గురువారం ఉదయం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతికి ఆర్థిక ఇబ్బందులు కారణం అని బంధువులు చెబుతున్నారు. ఫర్నిచర్ షాపులో పనిచేస్తున్న అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్