సీతానగరం,సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తం చేస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిఎంఓ డా. టి. జగన్ మోహనరావు, బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డా. టి. హేమాక్షి సోమవారం బూర్జ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. హఠాత్తుగా మారుతున్న వాతావరణ పరిస్థితుల రీత్యా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు వివరించారు. ఈ సందర్భంగా వారు ఎండలు, వర్షాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ నిరుపేదలకు గొడుగులు పంపిణీ చేశారు.