మృగశిర కార్తి సమీపిస్తున్న సమయంలో జోరుగా వ్యవసాయ పనులకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల కురిసిన చెదురు మదురు వర్షాలకు పొలాల్లోని కుంటల్లో నీరు చేరడంతో నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఖరీఫ్ దుక్కులు జోరుగా సాగుతున్నాయి. ఆర్బికెల ద్వారా రైతులకు రాయితీపై విత్తనాలను సమకూర్చనున్నట్లు ప్రకటించడంతో విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు.