లక్కవరపుకోట మండలం కళ్లెంపూడి గ్రామంలో శ్రీ సువర్చల సహిత పంచముఖ ఆంజనేయస్వామివారి దేవాలయం నిర్మించారు. ఈనెల 6 నుండి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాకార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతిష్ఠ అనంతరం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి 8వ తేదీన మహా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.