మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్యంలో దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది.. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకే రాష్ట్రంలో కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరికింది. సీఎం
జగన్ ఎప్పుడు అబద్ధాలు చెప్పను అని చెప్తుంటాడు.. అదే ఓ పెద్ద అబద్ధం." అని విమర్శించారు.