అధికారులకు పవన్ కీలక ఆదేశాలు

77చూసినవారు
అధికారులకు పవన్ కీలక ఆదేశాలు
కాకినాడ జిల్లా ఏలేరు వరద ముంపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. వైద్య సేవలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రైతులకు భరోసా కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్