జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ఏపీ ప్రభుత్వ విప్లుగా ప్రకటించాలని కోరుతూ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు సోమవారం లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను విప్లుగా నియమించాలని కోరినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.