పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. గుజరాత్లో బీజేపీని ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. మణిపూర్ పరిస్థితిపై, నీట్ పరీక్షపై, రైతుల సమస్యలపై మోదీ సర్కారును విమర్శించారు. జీఎస్టీ, ఐటీ విభాగాలు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలే వేధిస్తున్నాయని ఫైర్ అయ్యారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల కోసమే మోడీ సర్కార్ పని చేస్తోందని ధ్వజమెత్తారు.