ప్రొఫెషనల్ పరీక్ష అయిన నీట్ను .. కమర్షియల్ ఎగ్జామ్గా మార్చారని లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ గురించి ప్రస్తావన లేదు. నీట్ ఎగ్జామ్ను ధనికుల కోసమే రూపొందించారని విద్యార్థులు అంటున్నారు. నీట్ పాసైనా ఫీజులు ఎలా కట్టాలని మధ్యతరగతి విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు’ అని తెలిపారు.