AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూలై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం కానున్నారు. 2న కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 2వ తేదీనే సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించనున్నారు.