హైకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి

61చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తమకు భద్రత పెంచాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డికి 1 ప్లస్ 1 భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలుపారు. ఎవరికి ఎంత భద్రత ఇవ్వాలనేది సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుందని పిటిషనర్ల తరపు న్యాయవాది పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జులై 8కి విచారణను వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్