వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి

83చూసినవారు
వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ ఈ ప్రపంచ కమ్మ మహాసభ వేడుకలకు వేదికగా నిలవనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్