AP: మే నెల పెన్షన్ డబ్బుల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి 2 విధానాల్లో నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. మొత్తం 65.30 లక్షల మంది పెన్షనర్లలో 47.74 లక్షల మందికి DBT ద్వారా వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలిపింది. మిగతా 17.56 లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా సచివాలయ ఉద్యోగులు జూన్ 1 నుంచి 5వ తేదీలోగా పంపిణీ చేస్తారని వివరించింది.