పింఛన్ డబ్బులు మాయం (వీడియో)

57చూసినవారు
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం 7వ సచివాలయం పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా.. ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పింఛన్ అందని పరిస్థితి. సచివాలయ కార్యదర్శి మురళీ మోహన్ పింఛన్ పంచేందుకు రూ.4 లక్షలు తీసుకొని వెళ్తూ.. స్పృహ తప్పి పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పడిపోయాడు. అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్పృహ వచ్చిన తర్వాత బ్యాగులో నగదు కనిపించకపోవడంతో మురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్